జర్నలిస్ట్ అక్రిడిటేషన్ లపై కీలక నిర్ణయం
NEWS May 15,2025 07:38 pm
ఏపీ సర్కార్ జర్నలిస్ట్ అక్రిడిటేషన్ లపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది. ముగ్గురు మంత్రులతో క్యాబినెట్ సబ్ కమిటీని నియమించింది. క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులుగా పార్థసారధి, కందుల దుర్గేష్ , పయ్యావుల కేశవ్ ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా, ఇతర మీడియా సంస్థలకి సంబంధించి మీడియా అక్రిడిటేషన్ పై నివేదిక ఇవ్వనుంది మంత్రివర్గ ఉపసంఘం.