డిప్యూటీ డైరెక్టర్ వైఎస్ రెడ్డి నివాసంలో సోదాలు
NEWS May 15,2025 05:39 pm
ఈడీ దూకుడు పెంచింది. ముంబై టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్ వైఎస్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు చేపట్టింది. ముంబై, హైదరాబాద్ తో పాటు 12 చోట్ల తనిఖీలు చేపట్టింది. రూ. 9 కోట్లకు పైగా నగదు, రూ. 8 కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలు, రూ.23.25 కోట్ల విలువైన వజ్రాలు స్వాధీనం చేసుకుంది. 41 భవనాలకు అక్రమ అనుమతులు ఇచ్చారనే ఆరోపణలపై కేసు నమోదు చేసింది ఈడీ.