రూ. 33 వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం
NEWS May 15,2025 05:26 pm
సీఎం చంద్రబాబు అధ్యక్షతన స్టేట్ ఇవ్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశం జరిగింది. 19 ప్రాజెక్టులకు సంబంధించి రూ.33 వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. కూటమి ప్రభుత్వం పాలసీలతో పెట్టుబడులకు దేశ, విదేశీ సంస్థలు ఆసక్తి చూపించాయని అన్నారు సీఎం. ఎనర్జీ, టూరిజం, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో 35 వేల మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయని చెప్పారు.