భారత్ మరో ముందడుగు వేసింది. చీటికి మాటికి కయ్యానికి కాలు దువ్వుతున్న పాకిస్తాన్ కు మరో షాక్ ఇచ్చింది. ప్రత్యర్థి దేశం పదే పదే డ్రోన్లను ప్రయోగిస్తుండడంతో వాటికి చెక్ పెట్టేందుకు స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన భార్గవాస్త్రను ప్రయోగించింది విజయవంతంగా. దీనిని సోలార్ డిఫెన్స్, ఏరోస్పేస్ లిమిటెడ్ (ఎస్ఓఏఎల్) తయారు చేసింది.