కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాలు అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి. ఈ ఉత్సవాలను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు. త్రివేణి సంగమంలో తొలి స్నానం ఆచరించారు మధనానంద సరస్వతి స్వామి. పుణ్య స్నానాల కోసం కాళేశ్వరానికి భారీగా చేరుకున్నారు భక్తులు. ఇవాల్టి నుంచి ప్రారంభమైన పుష్కరాలు మే 26 వరకు 12 రోజుల పాటు కొనసాగుతాయి. ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది.