చరిత్రలో నిలిచి పోయేలా మహానాడు
NEWS May 15,2025 06:45 am
కడపలో మొట్ట మొదటిసారిగా నిర్వహిస్తున్న మహానాడు చరిత్రలో గుర్తుండి పోయేలా నిలిచి పోతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ నెల 27, 28, 29వ తేదీల్లో జరుగుతున్న మహానాడు కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత జరుగుతున్న తొలి మహానాడు అని అన్నారు. గతంలో రాయలసీమలో తిరుపతి వంటి చోట్ల మహానాడు నిర్వహించినా ఈసారి కడపలో తొలిసారి నిర్వహిస్తున్నామని అన్నారు. అనేక సవాళ్లు, సంక్షోభాలను ఎదుర్కొని 2024లో అధికారంలోకి వచ్చామని...ఏడాది కాలంలో అనుకున్న దానికంటే మెరుగైన పాలన అందించామని చెప్పారు.