నిరుద్యోగ యువతకు సీఎం రేవంత్ రెడ్డి తీపి కబురు చెప్పారు. త్వరలో అన్ని గ్రూప్ ఉద్యోగాల నియామకాలు పూర్తి చేస్తామని ప్రకటించారు. రాజకీయ దురుద్దేశంతో కొందరు కేసులు వేసి ఉద్యోగ నియామకాలను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. వారి వెనుక ఎవరు ఉన్నారో తనకు తెలుసన్నారు. కోర్టులో కేసులను అధిగమించి నియామకాల ప్రక్రియ చేపడతామన్నారు.