యూపీలో మరో సెమీ కండక్టర్
NEWS May 14,2025 05:14 pm
యూపీ సర్కార్ కు కేంద్రం తీపి కబురు చెప్పింది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి మరో సెమీ కండక్టర్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదించింది. హెచ్ సీ ఎల్ , ఫోక్స్ కాన్ సంయుక్త భాగస్వామ్యంతో యూనిట్ ను ఏర్పాటు చేయనుందని తెలిపారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. డిస్ప్లే డ్రైవ్ చిప్లు తయారికై దీనిని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. రూ. 3,700 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు స్పష్టం చేశారు.