న్యూ టెక్నాలజీతో నేరాల నియంత్రణ
NEWS May 14,2025 03:57 pm
నూతన టెక్నాలజీని ఉపయోగించి నేరాలను నియంత్రించడం జరుగుతుందని చెప్పారు హొం శాఖ మంత్రి వంగలపూడి అనిత. కృష్ణా జిల్లా ఉయ్యూరు రూరల్ మండలంలోని గండిగుంటలో కొత్త పోలీస్స్టేషన్ భవనాన్ని ప్రారంభించారు. మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే బోడె ప్రసాద్ హాజరయ్యారు. ఎక్సైజ్ శాఖలో సమూల మార్పులు సంస్కరణలు కొల్లు రవీంద్ర తీసుకు వస్తున్నారంటూ కితాబు ఇచ్చారు. 2014-19లో చేపట్టిన పనులు గత ప్రభుత్వంలో ఆగి పోయాయని ఆరోపించారు. కూటమి సర్కార్ వచ్చాక వాటిని తిరిగి చేపట్టడం జరుగుతోందన్నారు.