రూ. 3 లక్షల ఎల్ఓసీ అందజేత
NEWS May 14,2025 03:57 pm
మల్యాల మండలం నూకపల్లి గ్రామానికి చెందిన అలకుంట నవీన్ అనారోగ్యంతో నిమ్స్ లో జాయిన్ అయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 3 లక్షల ఎల్ఓసీ మంజూరు చేయించారు. ఇవాళ స్థానిక నాయకులు ఎల్ఓసీని బాధితునికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్ పర్సన్ మళ్లీశ్వరి శ్రీనివాస్ గౌడ్, మాజీ జడ్పీటీసి మారంపల్లి లక్ష్మణ్, జలంధర్, మిల్ట్రీ శ్రీనివాస్, భూమేష్, తదితరులు పాల్గొన్నారు.