బుడమేరు పెండింగ్ పనులు పూర్తి చేస్తాం
NEWS May 14,2025 11:15 am
సాధ్యమైనంత త్వరగా బుడమేరు పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు మంత్రి నిమ్మల రామానాయుడు. వరదకు గండ్లు పడిన ప్రాంతాలను పరిశీలించారు. గతంలో అత్యవసరంగా పూడ్చిన 3 గండ్లు కలిపి రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం పనులు మొదలు పెట్టబోతున్నామని ప్రకటించారు. సీజన్ మొదలయ్యేలోగా 3 గండ్ల నిర్మాణ పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.