కడప జిల్లాలో ఈతకు వెళ్లి ఐదుగురు చిన్నారులు మృతి చెందిన ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు హోంమంత్రి అనిత. బ్రహ్మంగారి మఠం మండలం మల్లేపల్లి చెరువులో ఈతకి దిగి మృత్యువాత పడడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వ పరంగా సాయం చేస్తామని ప్రకటించారు.