52వ సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రమాణం
NEWS May 14,2025 05:02 am
భారత దేశ అత్యున్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్ లో ప్రమాణం చేయించారు. ఈ ఏడాది నవంబర్ 23వ తేదీ వరకు తాను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా కొనసాగుతారు. ఆయన స్వస్థలం మహారాష్ట్ర. తను తొలుత ఆర్కిటెక్టర్ కావాలని అనుకున్నాడు. కానీ తన తండ్రి కోరిక మేరకు న్యాయ వృత్తిని స్వీకరించాడు. నిరాడంబర జీవితం ఆయనది.