సరస్వతీ పుష్కరాలకు రూ.8 కోట్లు రిలీజ్
NEWS May 14,2025 09:58 am
తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన చేసింది. ఈనెల 15 నుంచి 26 వరకు కాళేశ్వరం నది ఒడ్డున సరస్వతి పుష్కరాలు నిర్వహించనున్నారు. ఈ సందర్బంగా ఏర్పాట్ల కోసం రూ. 8 కోట్లు రిలీజ్ చేసింది. ప్రతి రోజు లక్షన్నర మందికి పైగా భక్తులు వస్తారని, పుణ్య స్నానాలు చేస్తారని అంచనా వేసింది. ఇప్పటికే ముమ్మరంగా ఏర్పాట్లలో నిమగ్నం అయ్యారు అధికారులు. ఈ సందర్బంగా మొబైల్ యాప్ ను కూడా ప్రారంభించారు.