ఏపీ లిక్కర్ స్కాంలో సిట్ దూకుడు
NEWS May 14,2025 09:54 am
ఏపీ లిక్కర్ స్కాంలో సిట్ దూకుడు పెంచింది. హైదరాబాద్ లోని జగన్ OSD కుమారుడు రోహిత్ రెడ్డికి చెందిన 6 కంపెనీల్లో సోదాలు నిర్వహించింది. రాజేంద్రనగర్, ఎస్ఆర్ నగర్, శేరిలింగంపల్లి, మెహిదిపట్నం, గుడిమల్కాపూర్, యాకుత్పురా లో ఉన్న కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టింది. సోదాల్లో అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకునట్లు సమాచారం.