36 ఎకరాల అటవీ భూమి పెద్దిరెడ్డి ఆక్రమణ
NEWS May 14,2025 09:44 am
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఉచ్చు బిగుస్తోంది. బుగ్గమఠం భూముల విషయంలో క్రిమినల్ కేసుల దిశగా ఏపీ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. పెద్దిరెడ్డి 36 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించారని త్రిసభ్య కమిటీ తేల్చింది.ఆక్రమణ భూమిలో బుగ్గమఠం ల్యాండ్ 3.88 ఎకరాలు ఉన్నట్టు గుర్తించింది. అటవీ చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు.