ఐపీఎల్ పై సన్నీ షాకింగ్ కామెంట్స్
NEWS May 14,2025 08:40 am
ఐపీఎల్ 2025 మెగా టోర్నీపై షాకింగ్ కామెంట్స్ చేశారు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్. భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ లో మిగిలి పోయిన మ్యాచ్ లలో డీజేలు, డ్యాన్సింగ్ గర్ల్స్ ఉండ కూడాదని స్పష్టం చేశాడు. క్రికెటర్లు, బీసీసీఐ , ప్రతి ఒక్కరు దేశం కోసం పోరాడుతున్న త్రివిధ దళాలకు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చాడు. ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.