పాకిస్తాన్ హై కమిషన్ ఉద్యోగిపై వేటు
NEWS May 14,2025 06:34 am
భారత ప్రభుత్వం పాకిస్తాన్ కు షాక్ ఇచ్చింది. ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ లో ఉద్యోగిగా పని చేస్తున్న రెహమాన్ ను బహిష్కరించింది. వెంటనే దేశం విడిచి వెళ్లి పోవాలని ఆదేశించింది. ఇక్కడ ఉంటూ పాకిస్తాన్ లోని ఐఎస్ఐకి సమాచారం చేర వేస్తున్నాడని, ఈ మేరకు నిఘా వర్గాలు ధ్రువీకరించాయని పేర్కొంది. అందుకే చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేసింది.