వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు
NEWS May 13,2025 07:43 pm
సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి భారీ ఊరట లభించింది. బెయిల్ మంజూరు చేసింది ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం. మంగళవారం ఈ కేసుకు సంబంధించి వాదనలు విన్న అనంతరం కీలక తీర్పు వెలువరించింది. ఇదిలా ఉండగా బెయిల్ రిలీజ్ అనంతరం వంశీ మాట్లాడారు. కూటమి సర్కార్ కావాలని అక్రమ కేసులు బనాయిస్తోందని ఆరోపించారు