భారత విదేశాంగ శాఖ సంచలన వ్యాఖ్యలు చేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన కామెంట్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. యుద్ధ సమయంలో అమెరికా, భారత్ మధ్య ట్రేడ్ గురించి చర్చ జరగ లేదని పేర్కొంది. కాల్పుల విరమణ ప్రతిపాదన పాక్ నుంచే వచ్చిందని తెలిపింది. జమ్మూకశ్మీర్ అంశంలో మధ్యవర్తిత్వం అవసరం లేదని స్పష్టం చేసింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (POK)ను అప్పగించాలన్నదే భారత్ విధానమని వెల్లడించింది.