ఏపీలో నరకాసుర పాలన - రోజా
NEWS May 13,2025 07:31 pm
మాజీ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి నిప్పులు చెరిగారు. ఏపీ సీఎం చంద్రబాబును ఏకి పారేశారు. రాష్ట్రంలో నారా వారి నరకాసుర పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. అరాచకాలు, అఘాయిత్యాలు, అత్యాచారాలు, అవమానాలు, అక్రమ కేసులు, వేధింపులు ఇవే చంద్రబాబు సూపర్ సిక్స్ అంటూ ఎద్దేవా చేశారు. వైసీపీ మహిళలనే కాదు టీడీపీ, జనసేన మహిళలను కూడా మోసం చేశారన్నారు. మనం బయటకు చెబుతున్నామని, కానీ వాళ్లు చెప్పుకోలేక సతమతం అవుతున్నారంటూ పేర్కొన్నారు.