ఆస్పత్రుల నిర్మాణం ఆలస్యంపై ఫైర్
NEWS May 13,2025 07:27 pm
సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష చేపట్టారు. ఆర్ అండ్ బీ శాఖ ఉన్నతాధికారులు వికాస్ రాజ్, హరిచందన, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా హాజరయ్యారు. ఆసుపత్రుల నిర్మాణం ఆలస్యం అవుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.కాంట్రాక్టర్లతో పని చేయించడం కూడా రాదా అంటూ మండిపడ్డారు. సనత్ నగర్ ఆసుపత్రిని జూన్ 2న ప్రారంభించాలని టార్గెట్ పెట్టుకున్నా, పనులు ఎందుకు వేగంగా సాగడం లేదని ప్రశ్నించారు. నిర్మాణం ఎప్పుడు పూర్తి చేస్తారో టెక్నికల్ గా అంచనా వేసి రిపోర్ట్ ఇవ్వాలంటూ ఆదేశించారు.