ఏపీకి వచ్చేందుకు 91 కంపెనీలు సిద్దం
NEWS May 13,2025 05:26 pm
ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీఎస్ అధికారులతో మంత్రి నారా లోకేశ్ సమీక్ష చేపట్టారు. రాష్ట్రానికి వచ్చేందుకు 91 పెద్ద కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. ప్రతి కంపెనీకి ఒక నోడల్ ఆఫీసర్ను నియమించాలని ఆదేశించారు. వేగవంతంగా యూనిట్ల స్థాపనకు యంత్రాంగం చర్యలు చేపట్టాలని సూచించారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో 5 లక్షల ఉద్యోగాలే ప్రభుత్వ లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు.