శ్రీశైలం ప్రాజెక్టు భద్రతపై సర్కార్ ఫోకస్
NEWS May 13,2025 04:15 pm
శ్రీశైలం ప్రాజెక్టు భద్రతపై కూటమి సర్కార్ ఫోకస్ పెట్టింది. ఫ్లంజ్ పూల్, దెబ్బతిన్న స్టీల్ సిలిండర్లు, కొండ భాగం కోతకు గురికావడంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు భద్రత, మరమ్మత్తు పనులపై ఆరా తీశారు. వెంటనే మరమ్మత్తు పనుల అంచనా తయారు చేయాలన్నారు. కేబినెట్ ఆమోదానికి నివేదికలు సిద్దం చేయాలని ఆదేశించారు.