ఇరిగేషన్ పనుల నిర్వహణ కోసం రూ. 344 కోట్లు
NEWS May 13,2025 03:41 pm
ఇరిగేషన్ పనుల నిర్వహణ, మరమ్మత్తుల కోసం చంద్రబాబు రూ. 344 కోట్లు నిధులు మంజూరు చేశారని తెలిపారు మంత్రి నిమ్మల రామానాయుడు. వందల,వేల కోట్లు పెట్టి ప్రాజెక్టులు నిర్మిస్తే వైసిపి ప్రభుత్వం మెయింటెన్స్ కూడా లేకుండా గాలికి వదిలి వేసిందన్నారు.తూడు, గుర్రపుడెక్క, పూడికతీత వంటి అత్యవసర పనులు కోసం 10 లక్షలు దాటితే కాలయాపన లేకుండా 7 రోజుల్లోనే పూర్తయ్యేలా షార్ట్ టెండర్లు పిలవాలని ఆదేశించామన్నారు.