మురళీ నాయక్ కుటుంబానికి రూ. 25 లక్షలు
NEWS May 13,2025 02:48 pm
దేశం కోసం ప్రాణాలు అర్పించిన జవాన్లకు రూ.50 లక్షలు ఇచ్చే సంప్రదాయం వైసీపీ ప్రభుత్వం మొదలు పెట్టిందని అన్నారు మాజీ సీఎం జగన్ రెడ్డి. ఇదే విధానాన్ని కూటమి ప్రభుత్వం కొనసాగిస్తోందని తెలిపారు. మంగళవారం దేశ సరిహద్దులో జరిగిన కాల్పుల్లో వీర మరణం పొందాడు నాయక్. ఈ సందర్బంగా తన కుటుంబాన్ని పరామర్శించారు. తమ పార్టీ తరపున రూ. 25 లక్షల ఆర్థిక సాయం చేస్తున్నట్లు ప్రకటించారు . అన్ని వేళలా అండగా ఉంటామన్నారు .