పాకిస్తాన్ కీలక ప్రకటన చేసింది. భారత్ జరిపిన ఆపరేషన్ సిందూర్ లో 11 మంది తమ దేశానికి చెందిన సైనికులు చని పోయారని వెల్లడించింది. మరో 78 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని తెలిపింది. మృతుల్లో పాక్ వాయుసేనకు చెందిన ఐదుగురు సిబ్బంది, ఆరుగురు ఆర్మీ సిబ్బంది ఉన్నట్లు స్పష్టం చేసింది. వీరిలో స్క్వాడ్రన్ లీడర్ ఉస్మాన్ యూసఫ్ కూడా ఉన్నట్లు సమాచారం. మొత్తం 40 మంది పౌరులు చనిపోగా 121 మందికి గాయాలైనట్లు దేశ సైన్యానికి చెందిన డీజీ ఐఎస్పీఆర్ స్పష్టం చేసింది.