శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.90 కోట్లు
NEWS May 13,2025 10:42 am
తిరుమల పుణ్యక్షేత్రం భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 68 వేల 760 మంది భక్తులు దర్శించుకున్నారు. 27 వేల 544 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.90 కోట్లు వచ్చినట్లు తెలిపారు టీటీడీ ఈవో జె. శ్యామల రావు. ప్రస్తుతం స్వామి వారి దర్శనం కోసం 10 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు కనీసం 4 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.