పాకిస్తాన్ కు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్
NEWS May 13,2025 09:59 am
ఈసారి పాక్ తోక జాడిస్తే కఠిన చర్యలు తప్పవని పాకిస్తాన్ కు భారత్ వార్నింగ్ ఇచ్చింది. ఈ సందర్బంగా ఆపరేషన్ సిందూర్ కు సంబంధించి కీలక ఆధారాలు విడుదల చేసింది. పాకిస్తాన్ లోని ఉగ్రవాదులనే తాము లక్ష్యంగా చేసుకున్నామని, తమ దాడుల్లో పాక్ పెంచి పోషించిన 110 మంది టెర్రరిస్టులు , అగ్ర నేతలు హతం అయ్యారని చెప్పింది. ఇంకోసారి గీత దాటాలని ప్రయత్నం చేస్తే తాట తీస్తామని పేర్కొంది.