ఇండిగో ఎయిర్ లైన్స్ పై పాల్ ఫైర్
NEWS May 13,2025 09:56 am
ఇండిగో ఎయిర్ లైన్స్ పై నిప్పులు చెరిగారు ప్రజాశాంతి పార్టీ చీఫ్ డాక్టర్ కేఏ పాల్. ఎక్స్ వేదికగా ఆయన తీవ్రంగా స్పందించారు బాయ్ కాట్ ఇండిగో అంటూ పోస్టు చేశారు. భారత్-పాక్ మధ్య శాంతి చర్చలు, శిఖరాగ్ర సమావేశానికి వెళ్లకుండా ఇండిగో ఎయిర్ లైన్స్ అడ్డుకుందని ఆరోపించారు. 18 ఏళ్లుగా ఎయిర్ లైన్స్ నడుపుతున్న ఇండిగో కోట్లాది మందిని మోసం చేసిందన్నారు. ఇండిగో ఎయిర్ లైన్స్ పై కోర్టుకు వెళతానని, వదిలే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు.