17 నుంచి ఐపీఎల్ ప్రారంభం
NEWS May 13,2025 09:53 am
క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది బీసీసీఐ. మే17 నుంచి ఐపీఎల్ తిరిగి ప్రారంభం కానుందని ప్రకటించింది. మిగిలి పోయిన మ్యాచ్ లకు సంబంధించి మొత్తం ఆరు వేదికలను ఖరారు చేసినట్లు తెలిపింది. అహ్మదాబాద్, జైపూర్, ఢిల్లీ, లక్నో, ముంబై, బెంగళూరు స్టేడియాల్లో మిగిలిన మ్యాచులు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఇదిలా ఉండగా జూన్ 3న ఐపీఎల్ ఫైనల్స్ జరుగతాయని బీసీసీఐ కార్యదర్శి జే షా స్పష్టం చేశారు.