దేశ వ్యాప్తంగా తిరంగా యాత్ర
NEWS May 13,2025 09:50 am
మోదీ నేతృత్వంలో త్రివిధ దళాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతమైందని రక్షణ శాఖ వెల్లడించింది. ఈ సందర్బంగా బీజేపీ సంచలన నిర్ణయం తీసుకుంది. తిరంగా యాత్ర పేరుతో ఆపరేషన్ సిందూర్ విజయంపై ప్రజల్లోకి వెళ్లేందుకు మంగళవారం నుంచి శ్రీకారం చుట్టింది. ఈ యాత్ర 11 రోజుల పాటు జరుగుతుందని స్పష్టం చేసింది పార్టీ.