ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సుల్తానియా
NEWS May 13,2025 09:45 am
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న రామకృష్ణా రావును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. తాజాగా ఈ కీలకమైన పోస్టులో సీనియర్ ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ సుల్తానియాకు బాధ్యతలు అప్పగించింది. ఆయనపై పలు ఆరోపణలు ఉన్నాయి. మొత్తంగా తెలంగాణకు చెందిన వారిని కాదని ఏపీ, ఇతర రాష్ట్రాల కేడర్లకు చెందిన వారికి పదోన్నతులు కల్పిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.