కాల్పుల విరమణ తర్వాత పాకిస్తాన్ మరోసారి ఉల్లంఘనలకు పాల్పడింది. సోమవారం రాత్రి జమ్మూ కాశ్మీర్ సాంబా సెక్టార్ లో డ్రోన్లతో దాడి చేసింది. 15 నిమిషాలపాటు డ్రోన్లతో దాడులకు పాల్పడింది. భారత్, పాక్ డ్రోన్ దాడులను తిప్పికొట్టింది. సాంబాలో బ్లాక్ అవుట్ మధ్య ఒక్కొక్క డ్రోన్ ను భారత రక్షణ వ్యవస్థ కూల్చివేస్తున్న దృశ్యాలు బయటికొచ్చాయి.