మే 13 నుంచి బీజేపీ తిరంగా యాత్ర
NEWS May 12,2025 10:36 pm
భారత సైన్యం పాకిస్థాన్ ఉగ్ర స్థావరాలపై చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' నేపథ్యంలో బీజేపీ దేశవ్యాప్తంగా 'తిరంగా యాత్ర' పేరుతో మే 13 నుంచి 11 రోజుల పాటు యాత్ర కొనసాగించనుంది. మోదీ నాయకత్వ పటిమతో పాటు, భారత సాయుధ బలగాల ధైర్యసాహసాలను, పరాక్రమాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమే ఈ 'తిరంగా యాత్ర' ముఖ్య ఉద్దేశమని బీజేపీ నేతలన్నారు.