ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన
NEWS May 12,2025 10:25 pm
ఎండపల్లి మండలం లోని తడిసిన వారి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం వెలుగటూరు ఏఎంసీ ఛైర్ పర్సన్ గుండాటి గోపిక జితేందర్ రెడ్డి సందర్శించారు. కొత్తపేట, గుళ్లకోట, పాతగుడూరు, రాజారాంపల్లి, గొడిశెలపేట గ్రామాల్లోని ప్రభుత్వ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె సందర్శించి తూకం వేసిన వరి ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు ఎగుమతి చేయాలని ఆదేశించారు. వైస్ చైర్మన్ గోల తిరుపతి డైరెక్టర్ మాచర్ల సంజీవ్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఉప్పునూటి మహేష్ రైతులు పాల్గొన్నారు.