తిరిగి తెరుచుకున్న 32 ఎయిర్ పోర్టులు
NEWS May 12,2025 11:37 am
భారత్- పాకిస్థాన్ మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో కొన్ని రోజులుగా మూసివేసిన 32 విమానాశ్రయాలను నేడు తిరిగి తెరిచినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు విమానయాన కార్యకలాపాలను పునరుద్ధరిస్తూ సంబంధిత అధికారులు నోటీస్ టు ఎయిర్మెన్ (నోటమ్) జారీ చేశారు. కొన్ని రోజుల పాటు నిలిచిపోయిన విమాన సేవలు ఈ నిర్ణయంతో తిరిగి సాధారణ స్థితికి చేరుకున్నాయి.