కొండగట్టులో గిరి ప్రదక్షిణ
NEWS May 12,2025 11:37 am
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ 28వ గిరి ప్రదక్షిణ చిలుకూరి బాలాజీ శివాలయం అర్చకులు సురేష్ అత్మరామ్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం ప్రారంభమైంది. ప్రతి పౌర్ణమికి జరిగే ఈ గిరి ప్రదక్షిణలో భాగంగా ఈ రోజు ఆధ్యాత్మికత ఉట్టిపడేలా, వేలాది మంది భక్తుల రామ నామ స్మరణతో కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దారం ఆదిరెడ్డి, మాజీ సర్పంచ్ బత్తిని శ్రీనివాస్ గౌడ్, దీక్షా స్వాములు, భక్తులు పాల్గొని గిరి ప్రదక్షిణ నిర్వహిస్తున్నారు.