ఉగ్రవాదులను అంతం చేస్తాం
NEWS May 12,2025 07:16 am
ఈ సారి పాకిస్థాన్ ఏదైనా చర్య తీసుకునే ధైర్యం చేస్తే పూర్తిగా మట్టు పెడతామని వార్నింగ్ ఇచ్చారు వైఎస్ అడ్మిరల్ ఏన్ ప్రమోద్. మనం ఏం చేయబోతామో పాకిస్థాన్కు బాగా తెలుసన్నారు. ఇప్పటికే భారత్ జరిపిన దాడుల్లో ఏకంగా 110 మంది టెర్రరిస్టులు హతమయ్యారని చెప్పారు. పాక్ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నామని అన్నారు. ఉగ్రవాదులను అంతం చేయడమే ఆపరేషన్ సిందూర్ టార్గెట్ అన్నారు.
ఆర్మీ, ఎయిర్ఫోర్స్, నేవీ సంయుక్త మీడియా సమావేశంలో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.