100 మంది ఉగ్రవాదులు హతం
NEWS May 12,2025 07:11 am
భారత్ సత్తా ఏంటో ఇప్పటికే పాక్కు చూపించామన్న త్రివిధ దళాలు. మళ్లీ కవ్విస్తే ఏం జరుగుతుందో పాక్కు తెలుసని వ్యాఖ్యలు. ఉగ్రవాదులు మాత్రమే తమ టార్గెట్ అని స్పష్టం చేశాయి. పాకిస్థాన్ డ్రోన్లతో దాడి చేయడంతో ప్రతి దాడి చేశామన్నారు.మిలిటరీ బేస్లు, రాడార్ స్టేషన్లను ధ్వంసం చేశామని వెల్లడించారు డీజీఎంఓ. ఇదే సమయంలో తమ దాడుల్లో 100 మంది ఉగ్రవాదులు హతం అయ్యారని తెలిపారు. ఇంకోసారి పాకిస్తాన్ గీత దాటితే చుక్కలు చూపిస్తామన్నారు.