తిరుపతిలో భద్రతా దళాల తనిఖీలు
NEWS May 11,2025 09:02 pm
వేసవి సెలవులు కావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. ఇదే సమయంలో భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్న తరుణంలో ఏ సమయంలోనైనా ప్రత్యర్థులు దాడులకు దిగే ఛాన్స్ ఉందంటూ నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ మేరకు భద్రతా దళాలు తిరుపతి రైల్వే స్టేషన్ లో తనిఖీలు చేపట్టారు. ప్రయాణీకులను నిశితంగా పరిశీలించారు. వారికి సంబంధించిన వస్తువులను తనిఖీ చేశారు.