గల్ఫ్ మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం
NEWS May 11,2025 08:58 pm
ఎండపల్లి మండలం కొత్తపేట గ్రామానికి చెందిన బూట్ల రాజేందర్ గత కొద్ది రోజుల క్రితం కింగ్ డం ఆఫ్ సౌదీ అరేబియా (కేఎస్ఏ గల్ఫ్) లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతుని కుటుంబానికి 2010-11 విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదివిన మిత్ర బృందం ఆదివారం 7600 రూపాయల ఆర్థిక సహాయం అందించి ఉదారతను చాటుకున్నారు. ఆర్థికంగా ఆదుకున్న మిత్ర బృందానికి పలువురితోపాటు మృతుని కుటుంబ సభ్యులు ధన్యవాదములు తెలిపారు.