తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల
NEWS May 11,2025 01:11 pm
తెలంగాణ ఎప్ సెట్ ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో రిలీజ్ చేశారు. అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్తోపాటు ఇంజినీరింగ్ విద్యార్థుల ర్యాంకులను ప్రకటించారు. అభ్యర్థులు తమ ఫలితాలను eapcet.tgche.ac.in/వెబ్సైట్లో చూసుకోవచ్చని తెలిపారు. కాగా, ఈసారి ఫలితాలు నేరుగా విద్యార్థుల సెల్ఫోన్కే వచ్చేలా ఏర్పాటు చేయడం విశేషం. ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ కోర్సుల్లో సీట్ల భర్తీ కోసం టీజీఎప్సెట్ పరీక్షను నిర్వహించారు. ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా ఎంట్రెన్స్ పరీక్షలు పూర్తవగా, మే 2 నుంచి 4 వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. అగ్రికల్చర్ విభాగంలో 81,198 మంది, ఇంజినీరింగ్ విభాగంలో 2,07,190 మంది విద్యార్థులు హాజరయ్యారు.