భారత వైమానిక దళం సంచలన ప్రకటన చేసింది. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియ లేదని తెలిపింది. ఇది కంటిన్యూగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. అప్పగించిన పనులను సమర్థవంతంగా పూర్తి చేశామని తెలిపింది. పాకిస్తాన్ కు చుక్కలు చూపించామని పేర్కొంది. పాకిస్తాన్ కు ఎవరు సపోర్ట్ గా నిలిచినా వారి భరతం పడతామని హెచ్చరించింది. మరో వైపు కాల్పుల విరమణ పాటిస్తామని చెప్పిన పాకిస్తాన్ ఉల్లంఘించింది.