పాకిస్తాన్ ప్రధాని ప్రేలాపన
NEWS May 11,2025 11:12 am
భారత్, పాకిస్తాన్ మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ తన ధోరణి మార్చు కోవడం లేదు. పైగా ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ దేశం భారత్ ను ఓడించిందని, రాఫెల్ యుద్ద విమానాలను కూల్చి వేసిందన్నారు. పాకిస్తాన్ దెబ్బకు భారత్ కాళ్ల బేరానికి వచ్చిందన్నారు షరీఫ్. దీనిపై సీరియస్ గా స్పందించారు నెటిజన్లు.