భారత్ కు వ్యతిరేకంగా ఉన్న శక్తులన్నీ ఏకమవుతున్నాయి. కాల్పుల విరమణ పాటిస్తామని ప్రకటించిన పాకిస్తాన్ తన బుద్దిని మార్చుకోలేదు. అమెరికా సైతం రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తోంది. ఈ తరుణంలో ముందు నుంచి పాకిస్తాన్ కు మద్దతు ఇస్తూ వస్తున్న చైనా మరోసారి తన కుటిల బుద్దిని బయట పెట్టుకుంది. పాకిస్తాన్ కు అండగా ఉంటామని ప్రకటించారు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. కాల్పుల విరమణను పాకిస్తాన్ ఉల్లంఘించినా సరే చైనా మద్దతివ్వడం గమనార్హం.