బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సంచలన కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. తమ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడితే చూస్తూ ఊరుకోమన్నారు. రేవంత్ ఓ శాడిస్ట్ అంతకు మించి సైకో అని అన్నారు. సీఎం అనే వ్యక్తి ప్రజల కష్టాలు తెలుసు కోవాలన్నారు. ఇలాంటి పిచ్చి వేషాలు మానుకోవాలని లేకపోతే పుట్టగతులు ఉండవన్నారు. తను ఓ తుగ్లక్ లాగా వ్యవహరిస్తున్నాడని ధ్వజమెత్తారు. ఈ సర్కార్ కు తలా తోకా లేదంటూ ఫైర్ అయ్యారు.