ప్రజాశాంతి పార్టీ చీఫ్ డాక్టర్ కేఏ పాల్ నిప్పులు చెరిగారు. ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తత నేపథ్యంలో తాను శాంతి నెలకొల్పేందుకు ప్రయత్నం చేస్తున్నానని స్పష్టం చేశారు. ఇందు కోసం పాకిస్తాన్ కు సపోర్ట్ గా ఉంటూ వస్తున్న టర్కీతో చర్చలు జరిపేందుకు వెళుతున్న సమయంలో తనను ముంబై ఎయిర్ పోర్ట్ లో పోలీసులు అడ్డుకున్నారని ఆరోపించారు. ఇది అప్రజాస్వామికమని ఆరోపించారు. శాంతి చర్చలు జరిపితే అడ్డుకుంటారా అని ప్రశ్నించారు.