భారత్ పాకిస్తాన్ కు ట్రంప్ కంగ్రాట్స్
NEWS May 10,2025 06:11 pm
భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ట్వీట్ చేశారు. ఇరు దేశాలు సంయమనం పాటించేందుకు ఒప్పుకున్నాయని తెలిపారు. శనివారం సాయంత్రం 5 గంటల నుండి కాల్పుల విరమణకు పాకిస్తాన్ ఓకే చెప్పిందన్నారు. ఈ సందర్బంగా రెండు దేశాలకు కంగ్రాట్స్ తెలిపారు ట్రంప్. రెండు దేశాలు కామన్ సెన్స్, గ్రేట్ ఇంటెలిజెన్స్ వాడాయంటూ పేర్కొన్నారు.