బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. హైదరాబాద్-పాతబస్తీలో చెల్లుబాటు అయ్యే పత్రాలు లేకుండా నివసిస్తున్న అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపాలని కోరారు. ఇక్కడి నుండి పంపించాలని కోరారు. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.